సజ్దా మరియు రుకూల ప్రాముఖ్యతను వివరిస్తున్నహజ్రత్ ఇమామ్ అలీ[అ.స] యొక్క మూడు హదీసులు.
అన్ని ఆరాధనలు కొన్ని చర్యలతో కూడి ఉంటాయి వాటిలో కొన్ని వాజిబ్ చర్యలైతే మరి కొన్ని ముస్తహబ్ చర్యలు అయి ఉంటాయి. కొన్ని ముఖ్యమైనవి అయితే మరి కొన్ని అతి ముఖ్యమైనవి అయి ఉంటాయి, కొన్ని ప్రతిష్టాత్మకమై ఉంటే మరికొన్ని అతిప్రతిషాత్మకమై అయి ఉంటాయి..., ప్రతీ చర్యకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ నమాజ్ లోని రెండు వాజిబ్ చర్యలు అయిన రుకూ మరియు సజ్దా యొక్క ప్రాముఖ్యత ఇమామ్ అలీ[అ.స] మూడు హదీసుల ద్వార తెలుసు కుందాం.
1. ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: అల్లాహ్ సన్నిధాన సజ్దా మరియు రుకూ, అతి ఉత్తమ ఆరాధన
2. ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: ఎక్కువ సజ్దా మరియు రుకూ తప్ప మరొకటి అల్లాహ్ యొక్క సామిప్యానికి చేర్చలేవు
3. ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: అల్లాహ్ వద్ద ఉన్న దాన్ని పొందాలనుకునే వారు తమ సజ్దా మరియు రుకూలను పెంచాలి[గురరుల్ హికమ్, పేజీ175]
రిఫ్రెన్స్
ఖుదాబఖ్షె కరమియాన్ జియారానీ, కలామె బర్తర్(సుఖనానె హజ్రత్ అలీ[అ] దర్బారయె నమాజ్.
వ్యాఖ్యానించండి