ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాఠించి ఆ అల్లాహ్ సామిప్యాన్ని కోరుకునే వారే ఆ అల్లాహ్ కరుణకు పాత్రులు కాగలరు.
ఇస్లాంలో పరిశుధ్ధతకు చాలా ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది ఆత్మపరిశుధ్ధతతో పాటు దేహపరిశుధ్ధత కూడా చాలా అవసరం.ఎప్పుడైతే మనిషి పరిశుధ్ధంగా ఉంటాడో అప్పుడే ఆ అల్లాహ్ కు దగ్గరవ్వగలడు అదే విషయన్ని ప్రస్థావిస్తూ ఆ అల్లాహ్ దైవగ్రంధంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు: “అల్లాహ్ పశ్చాత్తాప్పడేవారిని,పారిశుధ్ధ్యాన్ని అవలంబించేవారిని ఇష్టపడతాడు”[అల్ బఖర /222].
అలాగే నిత్యం ఉజూతో ఉండటానికి దైవప్రవక్తలవారు మరియు వారి ఉత్తరాధికారులైన ఇమాములు చాలా తాకీదు చేసి ఉన్నారు,ఒక హదీసులో దైవప్రవక్తలవారు ఈ విధంగా ప్రవచించారు: “ఒక వేళ నీకు కుదిరితే ఎల్లాప్పుడూ వుజూతో ఉండటానికి ప్రయంత్నించు ఎందుకంటే ఒక వేళ వుజూతో ఉన్న సమయంలోనే మ్రుత్యువు వస్తే నువ్వు షహీద్ వలె(అమరునివలె)ఈ లోకాన్ని విడుస్తావు”.
వేరే హదీసులో ప్రవక్తలవారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఎవరైతే వుజూతో(వుజూ చేసి) నిద్రిస్తారో వారు పడుకున్న పరుపే వారి మస్జిద్(ప్రార్ధనాస్తలము) వారి నిద్ర, ఎవరైతే రాత్రంతా మేల్కొని ప్రార్ధనలో గడిపి తెల్లవార్ల వరకు మేకువగా ఉన్నారో వారి ప్రార్ధనతో సమానం,మరియు ఎవరైతే వుజూ చేయకుండా నిద్రిస్తారో వారి పరుపు వారి యొక్క సమాధి మాదిరి మరియు నిద్రించేవాడు ఒక మృతశరీరంతో సమానం.
రెఫరెన్స్:
బిహారుల్ అన్వార్,77వ భాగం,పేజీ నం:305,వసాయెలుష్ షీయా,1వ భాగం,పేజీ నం:297.
వ్యాఖ్యలు
Mashallah
Mashallah
వ్యాఖ్యానించండి