దైవప్రవక్త[స.అ] అందరికి తమ ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు అందరు మౌనంగా ఎందుకు బయటికి వచ్చేశారు...
“దైవప్రవక్త[స.అ] అందరికి తమ ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు అందరు మౌనంగా ఎందుకు బయటికి వచ్చేశారు” అని ఎప్పుడైనా ఆలోచించారా?. కలం మరియు కాగితం ఇవ్వమని ఆదేశించినప్పుడు ఆజ్ఞను పాటించకుండా ఉన్నవారు ఇప్పుడెలా దైవప్రవక్త[స.అ] ఆదేశాన్ని అమలు పరిచారు?. ఇప్పుడెందుకు దైవప్రవక్త[స.అ] హిజ్యాన్ చెబుతున్నారు అని అనలేదు?. కారణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది దైవప్రవక్త[స.అ]కు లేఖనం వ్రాయనివ్వకుండా పురికొలిపి తమ ఉద్దేశంలో సఫలీ కృతులయ్యారని. విరుధ్ధం మరియు అల్లకల్లోలం సృష్టించి తమ ఉద్దేశంలో సఫలీ కృతులయ్యాకా ఇక దైవప్రవక్త[స.అ] ఇంట్లో ఉండడంలో ఎటువంటి లాభం లేదు. కొందరు దైవప్రవక్త[స.అ]ను లేఖనం వ్రాయమని మరి కొందరు ఉమర్ చెప్పినట్లుగా దైవప్రవక్త[స.అ] హిజ్యాన్కు గురయ్యారు అని అన్నారు. మాజాల్లాహ్ (అల్లాహ్ క్షమించుగాక). ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేయబడిన చర్య.
ఇస్లాం ఉమ్మత్ ఆలోచించవలసిన విషయం ఇది...
వ్యాఖ్యానించండి