దైవప్రవక్త[స.అ] సున్నత్ ను మార్చిన మర్వాన్ గురించి అబూ సయీదె ఖుద్రీ ఉల్లేఖన అనుసారం...
“అబూ సయీదె ఖుద్రీ” ప్రవచనం ప్రకారం: “దైవప్రవక్త[స.అ] ఈదుల్ ఫిత్ర్ లేదా ఈదుల్ అజ్హా నమాజు కోసం వెళ్ళి ముందుగా నమాజు చదివి ఆ తరువాత ప్రజల వైపు తిరిగి ఉపన్యాసం ఇచ్చేవారు. జనం వరుసగా కూర్చోని ఉండేవారు. ఆ పధ్ధతి అలాగే సాగేది. చివరికి ఒకరోజు నేను మదీనా అధికారి మర్వాన్తో కలిసి నమాజు కోసం బయలు దేరాను. ఆ రోజు నమాజు స్దలానికి చేరి “కసీర్ బిన్ సల్త్” తయారు చేసిన పీఠంపై నమాజు కన్నా ముందు (ఉపన్యాసించడానికై) ఎక్కాలనుకున్నాడు, అప్పుడు నేను వెనక నుండి అతడి కొంగు పట్టుకొని లాగాను కాని అతను తన కొంగును వదిలించుకొని పీఠంపై ఎక్కాడు. అతను నమాజు కన్న ముందే ఉపన్యాసమిచ్చాడు. అయితే “మీరందరు దైవప్రవక్త[స.అ] సున్నత్ను మార్చేశారు” అని అన్నాను అందుకు అతను “అబూ సయీద్ నీకు తెలిసిన విషయాల కాలం గడిచిపోయింది” అని అన్నాడు. “నాకు తెలిసిన విషయాలు ఈ కొత్త బిద్అత్(కొత్త విషయాలు)ల కన్న మేలైనవీ” అన్నాను. అందుకు అతను “జనం నమాజు తరువాత వేచివుండటం లేదు, అందుకని నేను ఉపన్యాసాన్ని ముందుగా ఇచ్చేశాను” అని అన్నాడు[సహీ బుఖారీ, భాగం1, పేజీ 122].
రిఫ్రెన్స్
బుఖారీ, సహీ బుఖారీ, భాగం1, పేజీ 122, కితాబుల్ ఈదైన్.
వ్యాఖ్యానించండి