ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ ఉల్లేఖనం ఖుర్ఆన్ ఆయతుల వెలుగులో...
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్, ఇబ్నె అబ్బాస్ తో ఇలా అన్నారు: “ఒకవేళ నేను భూమికి సమాన బంగారాన్ని అల్లాహ్ మార్గాన్న ఖర్చు చేసి అల్లాహ్ శిక్ష నుండి విముక్తి చెందగలను అంటే నేను ఇచ్చేసేవాడిని”.[బుఖారీ, భాగం2, పేజీ 201]
ఖుర్ఆన్ ప్రవచనం: “దుర్మార్గంచేసిన ప్రతి మనిషి వద్ద ఒకవేళ భూమిపై ఉన్న మొత్తం ధనం ఉంటే ఈ బాధనుండి రక్షింపబడేందుకు అతడు దానినంతా కూడా పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతాడు. వారు ఆ బాధను చూసినప్పుడు లోలోన పశ్చత్తాప పడతారు; అయినా వారిమధ్య పూర్తి న్యాయంతో తీర్పు చెయ్యబడుతుంది”[యూనుస్:54]
మరో ఆయత్ లో ఇలా ప్రవచించబడి ఉంది: “ఒకవేళ ఈ దుర్మార్గుల వద్ద భూమి పై ఉన్న మొత్తం సంపద ఉంటే, ఇంకా అంతే సంపద వారికి దొరికి ఉంటే, వారు ప్రళయం నాటి దారుణ శిక్ష నుండి తప్పించుకోవటానికి ఈ మొత్తం సంపదను పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతారు. అక్కడ అల్లాహ్ తరపు నుండి వారి ముందుకు, వారు ఎన్నడూ ఊహించి కూడ ఉండనిదంతా వస్తుంది. అక్కడ తమ సంపాదన యొక్క దుష్పలితాలన్నీ వారికి స్పష్టంగా తెలిసిపోతాయి. వారు ఎగతాళి చేస్తూ వచ్చినదే వారిని చుట్టుముట్టుతుంది”[జుమర్:47,48]
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ యొక్క ఉల్లేఖనం మరియు ఖుర్ఆన్ ఆయత్లను చదివి మీరే తీర్మానించండి...
రిఫ్రెన్స్
బుఖారీ, సహీ బుఖారీ, భాగం2, పేజీ 201.
వ్యాఖ్యానించండి