తమ అనుచరుల యొక్క మృత్యువును వివరించే ఇమాం అలి[అ.స] ల వారి ఒక ఉపదేశం.
ప్రతి ఒక్కరికి మృత్యువనేది రావలసినదే.దాని నుండి ఎవ్వరూ తప్పించుకొనలేరు.కానీ మృత్యువు ఏ విధంగా ఉంటుంది?ప్రత్యేకంగా ఇమాం అలి[అ.స] ల వారి షీయాలమని చెప్పుకుని పాపాలకు పాల్పడే వారి మృత్యువెలా ఉండబోతుంది? అనే ప్రశ్నలకు సమాధానం ఇమాం అలి[అ.స] ల వారి హదీసులలోనే దొరుకుతుంది.ఇమాం అలి[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: “మా షీయా నుండి పాపములనేవి జరగవు ఒక వేళ అతను పాపాలకు పాల్పడితే తన సంపదలో లేదా తన కొడుకు లేదా స్వయానా తాను నష్టాన్ని చవిచూడకుండా ఈ లోకాన్ని విడువడు. ఆ దేవునిని ఏ విధంగా కలుసుకుంటాడంటే అతనిలో పాపాల యొక్క ఏ విధమైన లక్షణాలు మిగిలి ఉండవు.ఒక వేళ మిగిలితే వాటిని మరణ సమయంలో అతి కష్టంగా ప్రాణాలను విడిచేలా చేయటం ద్వారా అతనిని శుద్ధపరచటం జరుగుతుంది [ఈ విధంగా అతను ఆ పాపాల నుండి పవిత్రుడై ఈ లోకాన్ని విడుస్తాడు]”.
రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,6వ భాగము,పేజీ నం: 157.
వ్యాఖ్యానించండి