.పనులలో మనము చేసే తొందరపాటే ఆ తరువాత పస్చాత్తాపానికి కారణమవుతుంది.
ఇమాం మొహమ్మద్ తఖి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “సమయానికి ముందు ఏ పనినైనా చేయకు ఎందుకంటే ఆ తరువాత నువ్వు పస్చాత్తాపడతావు”[కష్ఫుల్ ఘుమ్మా, 2వ భాగం, పేజీ నం:350].
ప్రతీ పనికి ఒక సమయం ఉంటుంది అలాగే ప్రతీ మాటకు ఒక సందర్భమనేది ఉంటుంది ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని తెలుసుకుని సమయస్పూర్తితో నడుచుకునే వాడే తెలివైన వ్యక్తి.ఏ పనిలోనైనా తొందరపాటు అనేది మంచిది కాదు,ఎలగైతే ఒక పండును పరిపక్వానికి చేరక ముందే దానిని ఆ చెట్టు నుండి వేరు చేయడం ఆ పండును నాశనం చేయడమే, ఒక విత్తనాన్ని దానికి అనుకూలించే సమయంలో నాటకపోతే అది నాశనమవుతుంది,సమయం రాక ముందే నమాజు మరియు ఉపవాసం వంటి ప్రార్ధనలను చేయటం వాటిని వ్రుధా చేసుకోవటమే ఇలాంటి ఎన్నొ ఉదాహరణలు ఉన్నాయి, సమయస్పూర్తి మరియు దూరద్రుష్టి అనేవి ఉంటేనే మనిషి ఏ పనిలొనైనా సాఫల్యాన్ని పొందగలుగుతాడు, దీనికి వ్యతిరేకంగా సమయానికి ముందు లేదా తొందరపాటుతో చేసే పని వలన తరువాత పశ్చాత్తాపం తప్పదు.
వ్యాఖ్యలు
Mashallah
వ్యాఖ్యానించండి