షైతాను మరియు మానవుని దీర్ఘకాలిక ఆకాంక్షలు అతని పశ్చాత్తాపానికి అడ్డంకిగా మారతాయి.వాటిని వదిలి ఆ అల్లాహ్ సన్నిధిలో క్షమాపణ కోరుకున్నట్లైతే అతను తన లక్ష్యానికి తప్పక చేరుకుంటాడు.
ఇమాం అలి[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఎటువంటి చర్య[ఆచరణ] లేకుండా పరలోకం గురించి ఆశించే వారి వలె ఉండకు మరియు [వారు] దీర్ఘకాలిక ఆకాంక్షలతో పశ్చాత్తాపాన్ని ఆలస్యం చేస్తారు”.
నిధిని పొందాలనుకునే వాడికి కష్టపడటం తప్పదు. పరలోకం,స్వర్గం మరియు ఆ దేవుని ప్రతిఫలాన్ని ఆశించేవానికి తన లక్ష్యాలను సాధించటానికి కష్టపడటం కూడా అవసరం.ఒక తోటమాలి లేదా ఒక రైతుకు దుక్కటం,దున్నటం,నీటిని అందించటం మరియు దానిని[పంటను] సం రక్షించటం అన్ని చేయాలి అవి చెయకుండా పంట చేతికి రాదు కదా?అలాగే నమాజు,రోజా,పాపాలను విడిచిపెట్టడం మరియు షైతానును విడిచి ఆ అల్లాహ్ యొక్క మార్గంలో జీవించడం లాంటివి చేయకుండా స్వర్గాన్ని పొందాలనుకోవటం కూడా మూర్ఖత్వమే.పాపము ఒక ఉచ్చు లాంటిది దానిలో చిక్కుకున్న వాడు అల్లాహ్ శిక్షనుండి తప్పించుకోలేడు.అలా చిక్కుకున్నవాడికి కేవలం పశ్చత్తాపం ఒకటే చికిత్స.పాపము ఒక ప్రాణాంతక వ్యాధిలాంటిది దానిని పశ్చాత్తాపంతో చికిత్స చేయకుంటే అది మానవునిని తప్పక నాశనం చేస్తుంది.అందుకే ఎంత తొందరగా తమ పాపాలకు పశ్చాత్తాపాన్ని గురై ఆ దేవుని సన్నిధిలో క్షమాపణను కోరుకుంటే అంత మంచిది.
రెఫరెన్స్: హిక్మత్ హాయె అలవి వ తౌజీహె చెహెల్ హదీస్ అజ్ ఇమాం అలి[అ.స],జవాద్ ముహద్దసి.
వ్యాఖ్యానించండి